బిజినేపల్లి, ఏప్రిల్ 9: మండలంలోని పాలెం ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ టీకా వేయించుకున్నారు. 45ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. పాలెం పీహెచ్సీ పరిధిలోని వడ్డెమాన్, పాలెం, గుడ్లనర్వ, ఖానాపూర్, కార్కొండ, వసంతాపూర్, లింగసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు టీకాను వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.
141మందికి కరోనా టీకా
తాడూరు, ఏప్రిల్ 9: మండలకేంద్రంలో ఏప్రిల్ 1 నుంచి శుక్రవారం వరకు 45 ఏండ్లు దాటిన 141మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యుడు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంరోజులుగా పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో టీకా వేయించుకుంటున్నారన్నారు.
221 మందికి కోవిడ్ టీకాలు
తిమ్మాజిపేట, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 221 మందికి వైద్య సిబ్బంది కొవీషీల్డ్ టీకాలు వేశారు. టీకా వేసుకున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు సూపర్వైజర్ సురేందర్రెడ్డి తెలిపారు.