నారాయణపేట, ఏప్రిల్ 9 : కరోనా కారణంగా మూతబడిన ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే వరకు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండ గా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మతో క లిసి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్కూళ్లు ప్రారంభం అయ్యే వరకు ప్రతి ఉపాధ్యాయుడికి, బోధనేతర సిబ్బందికి రూ.2వేల ఆర్థికసాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కరో నా కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి ఆర్థికసాయం చేస్తున్నారని ఆమె చెప్పారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ ప్రైవే ట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి చౌక దుకాణాల ద్వారా 25 కిలోల సన్నబియ్యం పంపిణీ అయ్యేలా అధికారులు చూడాలన్నారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్శర్మ మాట్లాడు తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, అందులో ఎంత మంది ఉపాధ్యాయులు, బోధనేతర సి బ్బంది విధులు నిర్వహిస్తున్నారనే వివరాలను ఈ నెల 15వ తేదీ లోగా సేకరించి పూర్తి వివరాలను 18 లోగా సమర్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎంఈవోలు, హెచ్ఎంలు సమన్వయంతో పని చేసి కచ్చితమైన వివరాలను సేకరించాలన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అరవింద్కుమార్ మాట్లాడుతూ వచ్చే 4 రోజుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కమిషనర్ నుంచి మొదలుకొని పారిశుధ్య కార్మికుల వరకు ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా కలెకర్లు, కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో 131 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, అందులో 1739 మంది ఉపాధ్యాయులు, 646 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సూచనల మేరకు లబ్ధిదారులకు ఆర్థిక సాయం, బియ్యం అందేలా చర్యలు చేపడుతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పౌరసరఫరా ల శాఖ అధికారి శివకుమార్, డీఎం సివిల్ సైప్లె హతీరాం నాయక్, ఎంఈవోలు పాల్గొన్నారు.