నాగర్కర్నూల్ ఎంపీ రాములు
గద్వాల, ఏప్రిల్ 9: జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిచౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయ్యాయని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. నిర్మాణానికి రూ.40 నుంచి రూ.45కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని, త్వరలో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మాట్లాడారు. ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ప్రమాదాలు జరుగకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. నడిగడ్డ ఎమ్మెల్యేలు ప్రయత్నం ఫలించిందన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించానన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ఎంపీ రాములు కృషి వల్ల గద్వాల నియోజకవర్గానికి పీఎంజీఎస్వై నిధులతో ఇందువాసి-బోయలగూడెం-గట్టు-మద్దెలడబండ, గద్వా ల-బిజ్వారం, నెట్టెంపాడ్-గుడ్డెందొడ్డి ప్రాం తాల్లో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ప్రసాద్ స్కీం కింద అలంపూర్ ఆలయానికి ఎంపీ కృషితో రూ.40కోట్లు మంజూరయ్యాయన్నారు. జోగుళాంబ రైల్వేహాల్ట్ను అభివృద్ధి చేసి అన్ని రైళ్లు ఇక్కడ అగేవిధంగా ఎంపీ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీవైస్ చైర్పర్సన్ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.