అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేయండి
రోడ్డు వెడల్పు, వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి
జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 9 : వేసవిని దృష్టిలో ఉం చుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 1వ స్థాయీ సంఘం(ప్రణాళిక, ఆర్థిక), 7వ స్థాయీ సంఘం (నిర్మాణ పనులు) సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 4వ స్థాయీ సంఘం (విద్య, వైద్య సేవలు), ధన్వాడ జెడ్పీటీసీ విమలాదేవి అధ్యక్షతన 6వ స్థాయీ సంఘం (సాంఘిక సంక్షేమం), నర్వ జెడ్పీటీసీ జ్యోతి అధ్యక్షతన 5వ స్థాయీ సంఘం (మహిళా శిశు సంక్షేమం) సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను చది వి వినిపించారు. ఆయా స్థాయీ సంఘాల్లో జెడ్పీ చైర్పర్స న్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీ వద్ద మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు అంతరాయం క లుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పేట, మక్తల్, కొ డంగల్ నియోజకవర్గా ల్లో రోడ్డు వెడల్పు పనులు, వంతెన ని ర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే సీఆర్ఎఫ్ పనులను, ఎండీఆర్ ప్లాన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. కరోనా వైర స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు జాగ్రత్తగా ఉం డాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వైద్య ఆరో గ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలన్నారు.
5వ స్థాయీ సంఘం సమావేశానికి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చే యాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో భా గంగా నర్సరీల్లో లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలన్నా రు. జీవో నం.37 ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8లక్షలను అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
45 ఏండ్లు పూర్తయి అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. అవసరం ఉన్నప్పుడే బయటకు వెళ్లాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా సీఈవో సిద్ధి రామప్ప, కోస్గి జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు వాహిద్, ఊ ట్కూర్ జెడ్పీటీసీ అశోక్, పేట జెడ్పీటీసీ అంజలి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.