సర్వే ఫలితాల్లో 20వార్డుల్లో టీఆర్ఎస్ విజయం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, మే2: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగురవేయనున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో 20వార్డుల టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. సోమవారం జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ఎన్నికల నిర్వహణ అధికారులకు సహకరించాలని సూచించారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల నిర్వహణ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించనున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తున్నదన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో 20వార్డులకు 20వార్డులు గెలుపొంది రికార్డు తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థులు కొవిడ్ నేపథ్యంలో సంబురాలకు దూరంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులు గెలుపొందిన తర్వాత అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా పనితీరు ఉండాలన్నారు. పనిచేసే వారికే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధిపై దృష్టిసారిస్తే తాను పల్లెలు, తండాలు, గూడెంల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని స్సష్టం చేశారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వేను పూర్తి చేసి రెండు నెలల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తానని, అచ్చంపేటను అభివృద్ధిలో మరో సిద్దిపేటగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విప్ గువ్వల స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.Mahabubnagar 03-05-2021సర్వే ఫలితాల్లో 20వార్డుల్లో టీఆర్ఎస్ విజయం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, మే2: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగురవేయనున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో 20వార్డుల టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. సోమవారం జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ఎన్నికల నిర్వహణ అధికారులకు సహకరించాలని సూచించారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల నిర్వహణ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించనున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తున్నదన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో 20వార్డులకు 20వార్డులు గెలుపొంది రికార్డు తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థులు కొవిడ్ నేపథ్యంలో సంబురాలకు దూరంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులు గెలుపొందిన తర్వాత అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా పనితీరు ఉండాలన్నారు. పనిచేసే వారికే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధిపై దృష్టిసారిస్తే తాను పల్లెలు, తండాలు, గూడెంల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని స్సష్టం చేశారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వేను పూర్తి చేసి రెండు నెలల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తానని, అచ్చంపేటను అభివృద్ధిలో మరో సిద్దిపేటగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విప్ గువ్వల స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.