జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
పేదలకు అండగా సీఎం సహాయనిధి
సీఎంఆర్ఎఫ్, ప్రమాదబీమా చెక్కుల పంపిణీ
జడ్చర్ల, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని పేదల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్లలోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, ప్రమాదబీమాకు సంబంధించి దాదాపు రూ.54లక్షల చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 63మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపేదవాడికి ఏదోరూపకంగా ప్రభుత్వ ఫలాలను అందజేస్తున్నదన్నారు. పేదప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే సీఎం కేసీఆర్ పలు రకాల పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలు, అనారోగ్యపరమైన చికిత్సలను ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి నుంచి ఆదుకుంటున్నారన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సలు పొందిన వారు డబ్బుల కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం సహాయనిధి ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్నారు.
అర్హులైన నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు
అర్హులైన నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లను ఇవ్వనున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని చైతన్యనగర్లో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీకి రెవెన్యుశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేను చేపట్టారు. ఈ సర్వేను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చైతన్యనగర్ కాలనీలో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ జడ్చర్లలో ఇప్పటికే దాదాపు 1500 డబుల్బెడ్రూం ఇండ్లనిర్మాణలు కొనసాగుతున్నాయని వాటిని అర్హులైన నిరుపేదలకు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఇప్పటికే పట్టణ ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని వారిలో పూర్తిగా ఇండ్లులేని వారు, ఒకే ఇంట్లో ఎక్కువ కుటుంబాలు నివసిస్తే వారికి మొదటిప్రాధన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమి చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ చైర్మన్ మురళి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచ్ రవీందర్రెడ్డి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ సుదర్శన్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శివదర్శన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సత్యం, శ్రీకాంత్, కోట్లప్రశాంత్రెడ్డి, బృందంగోపాల్, నాగిరెడ్డి, ఇమ్మూ, రవిశంకర్ ఉన్నారు.