ఆకాశాన్నంటుతున్న ధరలు
రెండు నెలలుగా తగ్గని వైనం
నెలరోజుల్లో 10 శాతం పెంపు
లీటర్పై రూ.40 పెరుగుదల
పేదలకు ధరాభారం
పెబ్బేరు రూరల్/బాలానగర్, ఏప్రిల్ 2 : నూనె ధరలు మంటలేకుండానే సెగ పుట్టిస్తున్నాయి. రెండు నెలలుగా ఆకాశాన్నంటుతున్నాయి. నెలరోజుల్లోనే 10 శాతం పెరిగాయి. లీటర్ ఆయిల్పై దాదాపు రూ.40 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరోపక్క నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. నూనెలు ధరల రూపంలో సలసల కాగుతుండటంతో ధరాభారంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు చు క్కలు చూపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏదీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పట్టికలో వంటనూనె వచ్చి చేరిం ది. వంట నూనె ధరలు సలసలమంటున్నా యి. ఊహించని రీతిలో ఆకాశాన్నంటుతున్నాయి. నెలల వ్యవధిలోనే రెండింతలయ్యాయి. ఆరు నెలల కిందట పామాయిల్ లీటరు ప్యాకెట్ ధర రూ.65-70 ఉండగా.. ప్రస్తుతం రూ.125-130కు చేరుకున్నది. స న్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ రూ.95-100 ఉండగా, ఇప్పుడు రూ.160-170 ప లుకుతున్నది. కంపెనీ బ్రాండులను బట్టి ధర లు కాస్త అటుఇటుగా ఉంటున్నాయి. గతేడాది చివరి నుంచి ధరలు స్వల్పంగా పెరుగుతుండగా, రెండు నెలల నుంచి ఊ హించని రీతిలో పెరుగుతున్నాయి. ఎవరికీ అందుబాటులో లేని విధంగా రాకెట్లా దూసుకుపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ధరలు తగ్గడం కాదు కదా.. నిలకడగా ఉం డే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ రోజు ఉన్న ధర.. రేపు లే కుండాపోతున్నదని వ్యాపార వ ర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో లీటర్ పామాయిల్ రూ.150కి, సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.200కు చేరొచ్చంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి కాకపోవడంతో నూనె ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్ సమాయానికి.. ప్రస్తుతానికి కిలో నూనెపై సుమారు రూ.40 వరకు పెరగడం విశేషం.
ధరలను నియంత్రించాలి..
నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. లాక్డౌన్కు.. ఇప్పటికీ కిలోపై రూ.నలభై నుంచి రూ.యాబై పెరిగింది. కూరలో నూనె తక్కువగా వాడాల్సి వ స్తున్నది. పిండి వంటలు చేసుకోవాలంటే అధికంగా ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించాలి.
వ్యాపారం బాగా తగ్గిపోయింది..
వంటనూనె ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు వినియోగాన్ని బాగా తగ్గించారు. నెలలో నాలుగు లీటర్లు కొనే వారు రెండు లీటర్లకే పరిమితమవుతున్నారు. ఇంతగా ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలియడం లేదు. కంపెనీ ప్రతినిధులను అడిగినా చెప్పడం లేదు. ధరల పెరుగుదలతో అన్ని వర్గాల వారు సతమతమవుతున్నారు. ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
కొసరికొసరి వాడుతున్నాం..
ఏ కూర వండాలన్నా నూనె వేయాల్సిందే. కాస్త తక్కువైనా రుచి లోపిస్తుంది. అలాంటి వంట నూనె ధరలు ఈ స్థాయి లో పెరుగుతాయని ఊహించలేదు. నిత్యావసరాల్లో ముఖ్యమైన నూనె ధరలు ఆకాశానంటుతుండ డం సామాన్య కుటుంబాలకు పెనుభారమే. ఆగకుండా ధరలు పెరుగుతుండడంతో కొసరి కొసరి వాడుతున్నాం. పిం డి వంటల జోలికే వెళ్లడం లేదు.
ఇవి కూడా చుడండి
రాష్ర్టానికి మరో రెండు నేషనల్ హైవేలు
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి