గద్వాల, ఏప్రిల్ 2: కేటీదొడ్డి మండలంలో వెలిసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన చైర్మన్గా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఆలయ నూతన చైర్మన్గా ఎన్నికైన ఆయనకు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే శక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి అమావ్యాసతోపాటు ప్రతి శనివారం అధికసంఖ్యలో వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చైర్మన్ చూసుకోవాలన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు.దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. నూతన ఆలయ చైర్మన్గా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యే తనను ఆలయ చైర్మన్గా నియమించారని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పురపాలక చైర్మన్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, సర్పంచులు వాసు, సత్యారెడ్డి, ఎంపీటీసీ శంకర్గౌడ్ నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు.