సీపీ తరుణ్జోషి
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 10 : విధులు నిర్వర్తించే ప్రతి పోలీస్ కొవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పిలుపునిచ్చారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, వ్యాక్సిన్ తీసుకోని వారు తక్షణమే వేయించుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలున్న వారు డాక్టర్ సలహాలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ రేంజ్ ఐజీ ప్రమోదుకుమార్, ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ జనార్దన్, ఎసీపీ, ఆర్ఐలు టీకా వేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ సీఎం జగన్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
రైతులతో మరిన్ని చర్చలకు ప్రభుత్వం సిద్ధం : నరేంద్ర తోమర్