కేటీకే 6వ గని ప్రమాద మృతులకుటుంబాలకు సింగరేణి డైరెక్టర్ల భరోసా
అర్ధరాత్రి భూపాలపల్లికి రాక
కంటతడిపెట్టిన ఏరియా జీఎంనిరీక్షణ్రాజ్
ఎమ్మెల్యే గండ్ర హామీతో సంఘాలనేతలు, కార్మికుల ధర్నా విరమణ
భూపాలపల్లి, ఏప్రిల్ 8 : గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సింగరేణి సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్ (పా అండ్అపరేషన్), బలరాం (ఫైనాన్స్అండ్పీపీ) అన్నా రు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వారు బుధవారం అర్ధరాత్రి హుటాహుటిన హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి వచ్చి సింగరేణి దవాఖానకు వెళ్లారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి సంస్థ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను విచారించారు.
ఎమ్మెల్యే గండ్ర హామీతో ధర్నా విరమణ
భూపాలపల్లి సింగరేణి దవాఖానకు కార్మిక సంఘా ల నేతలు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు చేరుకుని భూపాలపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం విజయప్రసాద్తో మాట్లాడారు. గని స్థలం ప్రమాదకరంగా ఉందని రెండు నెలల క్రితమే అధికారుల దృష్టికి సూపర్వైజర్లు, కార్మికులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వర కూ ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ఇదే సమయంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్రాజ్ అక్కడికి చేరుకుని కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. కాసేపటి తర్వాత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి ఏరియా దవాఖానకు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. ఘటనపై విచారణ చేపడతామని, పరిహారం అంశాన్ని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. డబుల్బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో ధర్నా విరమించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాల కు తీసుకెళ్లారు. మృతుల కుటుంబాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి..
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కొప్పుల
కరోనా బోర్.. పేపర్ కౌబాయ్ తయ్యార్