ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువకుడు
వరంగల్ చౌరస్తా, మే 5: కరోనాతో పోరాటం చేసి గెలిచిన యువ కుడు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్లాస్మా దానం చేసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజాం నగర్ ప్రాంతానికి చెందిన ఉమ్మల్ల వెంకటేశ్(24) కళాశాలల బంద్ కారణంగా ఇంటి వద్దే వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. గత ఏప్రిల్ 2వ తేదీన కరోనా బారినపడి 12వ తేదీన కోలుకున్నాడు. ఇదిలా ఉండగా, వరంగల్ నగరంలోని ఆదిత్య, మ్యాక్స్కేర్ దవాఖాన ల్లో చికిత్స పొందుతున్న జక్కుల సంధ్య, సాంబయ్యకు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి ప్లాస్మా అవసరమైంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి బాధితులు యువ నేతాజీ ఫౌండేషన్ ప్రతినిధులు కొత్తకొండ అరుణ్కుమార్, కన్నె రాజును సంప్రదించారు. గతంలో ఫౌండేషన్ ద్వారా ఓ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని 14 సార్లు రక్తదానం చేసిన వెంకటే శ్ను సంప్రదించగా ప్లాస్మా దానం చేయడానికి అంగీకరించాడు. తెల్ల వారుజామున తన స్వస్థలం నుంచి వరంగల్కు చేరుకొని ప్రాణాపా య స్థితిలో ఉన్న బాధితులకు ప్లాస్మా దానం చేశాడు. ఈ సందర్భంగా యువ నేతాజీ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులు పూర్వపు ఆరోగ్యస్థితికి చేరుకున్నాక ప్లాస్మా దానం చేయవచ్చని, చాలా మంది కోలు కున్న తరువాత చేయ డానికి భయపడు తున్నారని అన్నారు. అందులో ఎలాంటి అపోహలు పెట్టుకో వద్ద ని, ప్లాస్మా దానం చేయడం మూలంగా ఎటువంటి ఇబ్బందులు కలుగవని వారు పేర్కొన్నారు.