చిన్నగూడూరు, (మరిపెడ) ఏప్రిల్ 3 : కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. శనివారం మరిపెడ, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన 207 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మరిపెడలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంద్రుల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అనతి కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకాలు నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. వ్యయసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతును రాజుగా చూడాలన్న లక్ష్యం తో కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపుడి నవీన్రావు, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, పీఏసీఎస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సిందూరాకుమారి, తహసీల్దార్ పుల్లారావు, రమేశ్, వైస్ ఎంపీపీ వీరన్న ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
పది కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్
కారుతో ఢీకొట్టి.. కత్తితో పొడిచి.. అమెరికాలో పోలీస్ మృతి