బాలానగర్, అక్టోబర్ 17: నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చిత్రాలు తీస్తారు. జరిమానా విధిస్తూ సందేశం పంపుతారు. ప్రమాదాల నివారణతో పాటు పారదర్శకత పాటించడానికి ఈ-చలాన్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వాహనచోదకులు నిబంధనలు పాటించకపోతే తెలియకుండానే జరిమానాలు విధిస్తారు. మీ సేవ కేంద్రాలు, బ్యాంకింగ్ నెట్వర్క్, పేటీఎం తదితర ఈ విధానాల ద్వారా సంబంధిత వాహనచోదకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు వాహన తనిఖీలు చేసేటప్పుడు ప్రత్యక్ష విధానంలో కొందరు పైరవీలు చేసి జరిమానాలను తప్పించుకునే వారు. ఇకపై అలా కుదరదు. ఈ-చలాన్ విధానంతో నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రత్యక్ష జరిమానాలు వేస్తారు. ప్రదేశం, తేదీ తదితర వివరాలు వాహనదారులకు చేరవేస్తారు. సమాచారం మొత్తం సంబంధిత వాహనదారుడి సెల్ఫోన్కు వెళ్తుంది.
నిబంధనలు పాటించకపోతే ఇబ్బందే..
ఇకపై వాహనచోదకులు విధిగా రహదారి నిబంధనలు పాటించాల్సిందే ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించిన చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాలు అతివేగంగా నడపడం, సిగ్నిల్స్ను దాటివెళ్లడం, హెల్మెట్ లేకుండా వాహనం నడుపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నోపార్కింగ్ ప్రాంతాల్లో వాహనం నిలిపిన తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో లాగా పోలీసులు వాహనాల తనిఖీలు అంటూ అడివి చేయరు. నేరుగా ఫొటో తీసి ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలను తెలుపుతూ ఇంటర్నెట్లో పొందుపరుస్తారు. అంటే ఎవరు వచ్చారు. ఎప్పుడు తీశారు. వివరాలు తెలుసుకునేలోపు జరిమానా మనకు పడిపోతుంది.
మైనర్లకు వాహనాలు నడిపిన..
ఈ-చలాన్ విధానం అమలు అవుతుండటంతో ఇకపై బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తే జరిమానా తప్పదు. ఇకపై నిర్ధేశిత ప్రాంతాల్లో వాహనాలు నిలపడం, వేగంతో నడపడం ఎలాంటి కాగితాలు, లేకుండా వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవు. ఈ విధానంతో వాహనదారుల్లో అప్రమత్తంగా పెరిగి స్వీయ నియంత్రణ అలవాటు పడుతుంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఈచలాన్ పద్ధతి ద్వారా వాహనదారుల ఇంటికి ఈ-చలాన్ వస్తుంది. వాహనాన్ని ఆపకపోతే అపరాధ రుసుము పోస్టు ద్వారా ఇంటికి పంపుతాం. ప్రమాదాల నివారణకు వాహనదారుల సంరక్షణకు ఈ-చలాన్ ఉపయోగపడుతుంది.