మహబూబ్నగర్, అక్టోబర్ 16: ప్రతిఒక్కరూ చెడును తొలగించుకుని మంచి వైపు అడుగులు వేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఎవరికీ లేని గొప్ప శక్తి మహిళలకు ఉంటుందన్నారు. జిల్లాకేంద్రంలో దసరా ఉత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రాం మందిర్ చౌరస్తా నుంచి జెడ్పీ మైదానం వరకు శోభాయాత్ర నిర్వహించారు. క్లాక్టవర్ వద్ద శోభాయాత్రలో పాల్గొన్న వారికి ఎక్తాకమిటీ సభ్యులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శోభాయాత్రలో సోలాపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బ్యాండ్ ఆకర్శణీయంగా నిలిచింది. జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన నరకాసురుడి ఫ్లెక్సీ దహనం చేశారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ గతంలో పండుగలు వచ్చాయంటే హైదరాబాద్లో భయం ఉండేదని, తెలంగాణ ప్ర భుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జ రుగలేదన్నారు. రెండేండ్లుగా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోలేదని, ఈ ఏడాది దసరా ఉత్సవా లు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు, అన్వర్పాషా, ఎంఏ హాది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే నా సంకల్పం
ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగడమే తమ సంకల్పమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పాండురంగ స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజతోపాటు ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద నూతనగా నిర్మించిన గార్డ్ రూంను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.
అభివృద్ధికి సహకరించాలి
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలోని పార్కింగ్, తదితర ప్రాంతాలను కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. బస్టాండ్లో పార్కింగ్, రాకపోకలకు, ఆటోగ్యారేజ్కు ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇప్పటికే ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశామని, వ్యాపారులు సాఫీగా వ్యాపారాలు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ కార్యాలయంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన రానుండటంతో బస్టాండ్ పరిసరాలను ఆధునీకంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ డిపోను ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకుగానూ భూమి కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండ్ ఎదుట ఉన్న సులబ్ కాంప్లెక్స్ను తొలగించి ఆధునిక సులబ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. పండ్లు విక్రయించే వారికి బస్టాండ్లో ఓ వైపు విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీఎస్పీ కిషన్, తాసిల్దార్ పార్థసారధి, ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు జీఎల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.