లింగాల/వంగూరు, అక్టోబర్ 14 : దేశ ప్రజలందరికీ అంబేద్కర్ ఆదర్శప్రాయుడ ని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తెలిపారు. గురువారం మండలంలోని అంబట్పల్లి గ్రామంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ విద్యావంతుడు కావడం వల్లే రాజ్యాంగ నిర్మాత అయ్యే అవకాశం కలిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితబంధు ప్రవేశపెట్టారన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. దళితులకు ప్రత్యే క నియోజకవర్గాలు ఉండాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునే వారి కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో వంగూరు ఎంపీపీ భీమమ్మ, సర్పంచులు రవిశంకర్, అం జి, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పూజితారాజు, ఉ మ్మాపూర్ ఎంపీటీసీ సాయిలు, సింగిల్ విండో చై ర్మన్లు హన్మంత్రెడ్డి, సురేందర్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, జెడ్పీ కో ఆ ప్షన్ హమీద్, ఉప సర్పంచ్ జనార్దన్, నాయకులు తిరుపతయ్య, రమేశ్, చిన్నబంగారయ్య, శివశంక ర్, బాలపీరు, భీముడు, సుధాకర్, కృష్ణారెడ్డి, గ ణేశ్రావ్, రాజేందర్రెడ్డి, రాజారంగారావు, దే వా, జానీపాషా, మల్లేశ్, జంగయ్య పాల్గొన్నారు.