ఆత్మకూరు, అక్టోబర్ 13 : జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రం 93,732 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 16 గేట్లెత్తి 64,720 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తికి 38,529 క్యూ సెక్కులు వదిలారు. ఎగువ జూరాలలో ఆరు యూనిట్ల నుంచి 4.298 మి.యూ, దిగువ జూ రాలలో ఆరు యూనిట్ల నుంచి 4.380 మి.యూ విద్యుదుత్పత్తి చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.434 టీ ఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజక్టు నుంచి 1,05, 790 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
టీబీ డ్యాంలో 10 గేట్లు ఎత్తివేత..
అయిజ, అక్టోబర్ 13 : టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. బుధవారం డ్యాంలో ఇన్ఫ్లో 20,758 క్యూసెక్కులు దీంతో 10 గేట్లు ఎత్తి 15,370 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి మొత్తం అవుట్ఫ్లో 20,338 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 12,233 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 11, 800 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఆనకట్ట లో 9.2 అడుగుల మేర నీటి మట్టం ఉండగా, కాల్వకు 433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి తగ్గుముఖం..
శ్రీశైలం, అక్టోబర్ 13 : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఒక్క క్రస్ట్ గేట్ను 10 అడుగుల మేర ఎత్తారు. సాయంత్రం 1,25,043 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాంలో ప్రస్తు తం 884.80 అడుగుల వద్ద నీటి నిల్వ ఉన్నది. ఒక్క గేట్ నుంచి 27,983, ఎడమ, కుడిగట్టు వి ద్యుదుత్పత్తి నుంచి 37,438 (మొత్తం 65,421 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేశారు.