‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాలమూరు పట్టణమంతా మార్మోగింది. సద్దుల బతుకమ్మ సంబురాలు అంబురాన్నంటాయి. ముంబయి నుంచి తీసుకొచ్చిన లేజర్షో ఆకట్టుకున్నది. రాష్ట్ర, జిల్లా కళాకారులు మినీ ట్యాంక్బండ్పై చేసిన నృత్యాలు హైలెట్గా నిలిచాయి. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ముగింపు కార్యక్రమం మహబూబ్నగర్లోనే అధికారికంగా చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వేడుకలకు మహబూబ్నగర్ పట్టణం చుట్టుపక్కల గ్రామాల మహిళలు భారీగా తరలివచ్చారు.
మహబూబ్నగర్, అక్టోబర్13: పాలమూరు పట్టణంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహబూబ్నగర్ పేరు ప్రఖ్యాతులు దేశామంతట వినిపించేలా బుధవారం ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ముందస్తుగా బతుకమ్మలను ఏర్పాటు చేసి బతుకమ్మ విశిష్టతను తెలిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముంబయి నుంచి తీసుకొచ్చిన పటాకులు పట్టణమంతా జిగేల్మంటూ వెలుగులు చిమ్మాయి. జిల్లా, రాష్ట్ర కళాకారులు ట్యాంక్బండ్పై చేసిన నృత్యాలు ఆకర్శణగా నిలిచాయి. మంత్రి శ్రీనివాస్గౌడ్ కుటుంబసభ్యులతో బతుకమ్మ వేడుకలకు హాజరై అందరినీ ఉత్సాహపర్చారు. పాలమూరు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. వేడుకలకు గ్రామీణ, పట్టణ మహిళలు భారీగా తరలొచ్చారు.
మీలో ఒకడినై ఉంటా..
మంత్రి శ్రీనివాస్గౌడ్
మీ సంక్షేమమే ధ్యేయంగా ప్రతిక్షణం ముందుకుసాగుతూ మీలో ఒకడిగా ఉంటానని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా ట్యాంక్బండపై నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. మహబూబ్నగర్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ పార్కును ప్రారంభిస్తామని, ఇందుకుగానూ రూ.750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పాలమూరులో తాగునీటి గోస ఉండనివ్వనన్నారు. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. వేడుకల్లో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్పవార్, సీతారామారావు, మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.