పాలమూరు సిగలో మరో మణిహారం
పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అడుగులు
రాష్ట్ర వైద్య బృందం సందర్శన
నాగర్కర్నూల్లోనూ మెడికల్ కాలేజీకి స్థల పరిశీలన
పాలమూరు సిగలోకి మరో మణిహారం రానున్నది. పాత కలెక్టరేట్
ఆవరణలో అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.300
కోట్లతో భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. ఇప్పటికే ఈ భవనం
వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించగా.. గురువారం రాష్ట్ర వైద్య బృందం
పరిశీలించింది. అలాగే నాగర్కర్నూల్లో నిర్మించనున్న మెడికల్
కాలేజీకి స్థల పరిశీలన కూడా చేశారు. దీంతో దవాఖాన, మెడికల్
కాలేజీ నిర్మాణానికి అడుగు పడింది. ఈ పనులు పూర్తయితే
మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానున్నది.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 9 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్లో ప్రస్తు తం ఉన్న కలెక్టరేట్ ఆవరణలో అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి మేరకు రూ.300 కోట్లతో సీఎం కేసీఆర్ అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ అధికారిక లాంఛనం పూర్తి కా గా.. సీఎం కేసీఆర్, మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర స్థాయి అత్యున్నత వైద్య బృం దం పాత కలెక్టరేట్ను సందర్శించారు. వీరి పర్యటనతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి వేగవంతమైన అడుగుపడింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు అధునాతన వైద్య సేవలందించేందుకు రంగం సిద్ధం అవుతున్నది.
పనులు త్వరగా చేపట్టేందుకు అడుగులు..
సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులను వెంటనే చేపట్టి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగం గా సీఎం ఓఎస్డీ డా.గంగాధర్, డీఎంఈ డా. రమేశ్ రెడ్డి నేతృత్వంలోని బృందం గురువా రం పాత కలెక్టరేట్ను పరిశీలించింది. పనులకుగానూ టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. దవాఖానలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం, అత్యాధునిక యంత్ర పరికరాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు వివి ధ బ్లాక్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ దవాఖాన బస్టాండ్కు ఎదురుగా, రైల్వేస్టేషన్కు దగ్గరగా ఉం డడం కలిసి వస్తున్నది. హైదరాబాద్లోని కార్పొరేట్ ద వాఖానలకు దీటుగా నూతన సూపర్ స్పెషాలిటీ దవాఖా న నిర్మించనున్నారు. ఈ క్రమంలో అత్యున్నత వైద్య బృందం పర్యటనతో పనులు మరింత వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దవాఖాన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. జనరల్ దవాఖానతోపాటు, వైద్యులు, సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, ఫ్యాకల్టీ క్వార్టర్స్, పార్కింగ్ తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టేందుకు వైద్య బృందం కలెక్టరేట్ మొత్తాన్ని తిరిగి ప రిశీలించింది. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారా వు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవ ర్ దగ్గరుండి పాత కలెక్టర్ స్థలాన్ని చూయించారు. దవాఖాన నిర్మాణంపై టీఎన్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రాజేంద్ర ప్రసాద్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, ఎస్ఈ సురేందర్ రెడ్డి తదితరులు వైద్య బృందానికి వివరించారు.
నాగర్కర్నూల్లో..
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 9 : జిల్లాలో ని ర్మించనున్న మెడికల్ కళాశాల స్థలాన్ని గురువారం హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృం దం పరిశీలించింది. ఓఎస్డీ గంగాధర్గౌడ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్, మహబూబ్నగర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రాంకిషన్ ఉయ్యాలవాడలోని సర్వేనెంబర్ 237లో ఉన్న 30 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అ నంతరం కలెక్టర్ ఉదయ్కుమార్, ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్రెడ్డితో కలిసి జిల్లా దవాఖానను పరిశీలించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ దవా ఖానను 300 పడకలకు అభివృద్ధి చేయాల్సి ఉంటుంద ని, అందుకు చేపట్టాల్సిన మార్పు, చేర్పులు, నూతన నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అలాగే సదుపాయాలు, అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ చేపట్టాల్సిన అదనపు నిర్మాణంపై ఇంజినీర్లతో మాట్లాడారు. గంగాధర్గౌడ్ మాట్లాడుతూ వైద్య కళాశాలను 660 పడకలతో నిర్మిస్తున్నప్పటికీ.. రానున్న రోజుల్లో సూపర్ స్పె షాలిటీ, ఇతర ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు మరింత స్థ లం అవసరం అవుతుందని, ఇప్పుడు కేటాయించిన 30 ఎకరాలతోపాటు మరింత స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. అవసరమైన మేరకు స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వీరివెంట డీఎంహెచ్వో సుధాకర్లా ల్, ఆర్డీవో నాగలక్ష్మి, సూపరింటెండెంట్ శివరాం, డీసీసీ బీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ప్రసాద్, వైద్య అధికారులు పాల్గొన్నారు.