రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్
ఏప్రిల్ 30 వరకు ఎలాంటి అనుమతులు లేవు
ర్యాలీలు, ఉత్సవాలు, సభలు నిర్వహించొద్దు
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్ టౌన్, మార్చి 28 : హోలీ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అ న్ని విద్యాసంస్థలను మూసివేశారన్నారు. కొత్త కా లం నుంచి వైరస్ తీవ్ర ప్రభావం చూపడడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలు, సభలు, వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని ప్ర భుత్వం అధికారులను ఆదేశించిందన్నారు. అలా గే హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, మహావీర్ జ యంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర సందర్భాల్లో మత పరమైన కార్యక్రమాలను నిర్వహించ రాదని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. బహిరంగ ప్రదేశా లు, ప్రజా రవాణా వాహనాల్లో, పని ప్రదేశాల్లో మాస్కులు తప్పకుండా వినియోగించాలని ఎమ్మె ల్యే తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించించామన్నారు. అనంతరం ఎస్సై రాములు మాట్లాడుతూ హోలీ సందర్భంగా పలు జాగ్రత్తలు పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అనుమతులు లేవని తెలిపా రు. బయట ఎవరూ తిరుగొద్దన్నారు. ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ఇవి కూడా చదవండి
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
రియల్మీ 8 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ