నాగర్కర్నూల్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వినాయక చవితి వేడుకలకు అన్ని గ్రామాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల ప్రతిష్ఠాపనకు మండపాలను ముస్తాబు చేస్తున్నా రు. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పీవోపీ విగ్రహాలతో పర్యావరణ కాలుష్యానికి ముప్పు పొం చి ఉన్నది. దీంతో మట్టి గణపతి విగ్రహాలకే మొగ్గు చూపాల్సిన అవసరం ఉన్న ది. మట్టి గణపతికే జై కొట్టాలని అధికారులు, నేతలు ప్రజలకు కోరుతున్నారు. రెండేండ్లుగా కరోనా కారణంగా సాధారణంగా జరిగిన వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఊరిలో, పట్టణాల్లోని వార్డుల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ బొజ్జగణపయ్యలు కొలువు దీరనున్నారు. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పా రిస్తో చేసే గణపతులు ఆకర్షణీయంగా ఉండడంతో అధిక శాతం వీటికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, మట్టి గణపతులను పూజించడమే శ్రేయస్కరమని శాస్త్రం కూడా చెబుతున్నది. వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచేనని దీనికి సంబంధించి పురాణగాథను కూడా వివరిస్తున్నారు. గణనాథుడిని పూజించే 21 రకాల పూజాపత్రాలు కూడా మట్టి నుంచే ఉ త్పత్తి అవుతాయనేది సత్యం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన గణనాథులను నిమజ్జనం చేయడంతో కాలువలు, నదుల్లో నీళ్లు కలుషితం అవుతున్నా యి. ఇవి నీటిలో కరుగవు. ఈ నీళ్లు తాగితే అనారోగ్యాలు వస్తాయి. పశువులు, గొర్రెలులాంటి జీ వులు తాగితే వెంటనే అనారోగ్యాలకు గురవుతా యి. వీటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేప ల పెంపకంపై కూడా ప్రభావం చూపుతుంది. కలుషితమైన నీటిని పంట పొలాలకు మళ్లించినా మనం తినే ఆహార పదార్థాలు కూ డా కలుషితమవుతా యి. శరీరంలో న రాలపై, కళ్లపై ప్రభావం చూ పిస్తుంది. ఫలితంగా చర్మసంబంధిత క్యాన్సర్ వ్యాప్తికీ కారణమవుతుంది. అదే మట్టి గణనాథులైతే చెరువుల్లో దొరికే బంక మట్టితో తయారవుతాయి. ఈ మట్టి నీళ్లల్లో సులువుగా కరుగుతుంది. నీటి కలుషితానికి, పర్యావరణ కాలుష్యానికి అవకాశం ఉండదు. దీనిపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. ఈ క్రమంలో మట్టి గణనాథులను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.