బంజారాహిల్స్ : దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ డిజైనర్లు రూపొందిన ఆభరణాలు,వస్త్రాలు, లైఫ్సైల్ ఉత్పత్తులను నగర వాసులకు అందించేందుకు ఇండియన్ డిజైనర్స్ హాథ్ సంస్థ ఏర్పాటు చేసిన పరంపర లైఫ్స్టెల్ ఎగ్జిబిషన్ బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో ఆదివారం ప్రారంభమయింది.
టాలీవుడ్ హీరోయిన్ అర్చనారవితో పాటు పలువురు మోడల్స్ ఈ సందర్భంగా ఆభరణాలు, వస్త్రాలు ధరించి చూపరులను ఆకట్టుకున్నారు.
లేటెస్ట్ ఇంటర్నేషనల్ ట్రెండ్స్ను, మారుతున్న ఫ్యాషన్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన డిజైన్లను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు దేబాశిష్ చటర్జీ తెలిపారు. ఈ ప్రదర్శన సోమవారం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.