మంత్రి గంగుల ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో 60,458 దరఖాస్తులు
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 6: మంచిర్యాల జిల్లా వ్యా ప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 29,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 8,659 కార్డులు మంజూరయ్యాయి. 2019లో వరుస ఎన్నికల కారణంగా వీటి జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత లాక్డౌన్ కారణంగా కార్డుల జారీ ప్రక్రియను చేపట్టలేకపోయారు. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వారు, కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి తాజాగా చేసిన ఈ ప్రకటనతో వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టారు. దీంతో రేషన్ కార్డు కావాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో రేషన్ కార్డున్న వారు అదే గ్రామంలోనే సరుకులు తీసుకోవాలనే నిబంధన ఉండేది. రేషన్ ఫోర్టబిలిటీతో రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం కల్పించింది.
దరఖాస్తులు ఇలా..
కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకునే వారు అడ్రస్ ప్రూఫ్, ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి చిరునామాకు సంబంధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులో ఏదో ఒకటి, కుటుంబ య జమానితో దిగిన ఫొటో, వయసు ధ్రువీకరణ పత్రం, ఆదా యం గ్రామాల్లో రూ. 1.6 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు మించకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు కుటుంబ స భ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నంబర్ కేటాయిస్తారు. మీ-సేవ కేంద్రం నిర్వాహకులు ఇచ్చే దరఖాస్తు ఫారంతోపాటు కావాల్సిన జిరాక్సు పత్రాలను అటాచ్ చేసి తహసీల్ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం వా రు పరిశీలించి, వారికి కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేస్తారు.
జిల్లాలో 60,458 దరఖాస్తులు పెండింగ్లో..
జిల్లా వ్యాప్తంగా 29,001 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,659 కార్డులు ఇది వరకే లబ్ధిదారులకు అందజేయగా, 462 కార్డులు నిబంధనల ప్రకారం లేని కారణంగా రిజక్ట్ అయ్యాయి. మిగిలిన 19,880 దరఖాస్తులలో 12,904 దరఖాస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ), 617 తహసీల్దార్ల వద్ద పరిశీలనలో ఉండగా, 6,359 దరఖాస్తులు పౌరసరఫరాల అధికారి వద్దకు చేరాయి. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో 32,002 మంది నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,598 దరఖాస్తులు అప్రూవ్ కాగా, 641 రిజక్ట్ అయ్యాయి. మిగతావి ఆర్ఐ వద్ద 8,211, తహసీల్దార్ వద్ద 516, డీఎస్వో వద్ద 10,036 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,643 మంది నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 4,929 దరఖాస్తులు అప్రూవ్ కాగా, 153 రిజక్ట్ అయ్యాయి.
మిగతా వాటిలో ఆర్ఐ వద్ద 3,508, తహసీల్దార్ వద్ద 332, డీఎస్వో వద్ద 4,721 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 35,236 మంది కొత్తవాటి కోసం దరఖాస్తు చేసుకోగా 20,463 దరఖాస్తులు అప్రూవ్ కాగా, 1,519 రిజక్ట్ అయ్యాయి. మిగతా వాటిలో ఆర్ఐల స్థాయిలో 6,343, తహసీల్దార్ వద్ద 758, డీఎస్వో వద్ద 6,153 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్ఐలు, తహసీల్దార్లు, డీఎస్వోల వద్ద కలిపి 60,458 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరికొన్నింటికి ఆమోదం లభించినప్పటికీ పౌరసరఫరాల కమిషనరేట్ ఆదేశాలతో నిలిచిపోయాయి. శాసన సభలో మంత్రి నూతన కార్డులు ఇస్తామని ప్రకటించడంతో, త్వరలో వీరందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డులు అందే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
దీదీ.. ముస్లిం ఓట్లను కోల్పోయింది: ప్రధాని మోదీ
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్ముఖ్