ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం/ ఖమ్మం, సెప్టెంబర్ 30: శ్రీదేవీ శరన్నవరాత్సోత్సవాల్లో భాగంగా దుర్గాదేవీ మండపాల్లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఒక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖమ్మం పాండురంగాపురం శ్రీరామలింగేశ్వర ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బత్తిని ఉపేందర్, ఉపాధ్యక్షుడు మాధవరావు, కోశాధికారి కృష్ణమాచారి, సహాయ కార్యదర్శి శీలం శ్రీను, ముక్కపాటి శ్రీను, గోపి, సురేశ్, ఉపేంద్రాచారి, వీరన్న, నర్సింహారావు, కృష్ణారెడ్డి, తిరుపతిరావు, ఎం.శ్రీను, లింగయ్య, రాంబాబు, హతీరాం, జీ.శ్రీను, ఏ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లిలోని శ్రీభక్తాంజనేయ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. చిలకల వెంకటనర్సయ్య, చిలకల రామనర్సయ్య, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వీ వెంకటాయపాలెంలోని బొడ్రాయి సెంటర్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద కుంకుమ పూజలను సర్పంచ్ రావెళ్ల మాధవి ప్రారంభించారు. అనంతరం అదే మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 41వ డివిజన్ శ్రీదాసాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని కార్పొరేటర్ కర్నాటి కృష్ణ ప్రారంభించారు. గుట్టలబజార్ శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవ్యాలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. వాసవీ అమ్మవారు శ్రీఅన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.