‘సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు.. రాష్ట్రంలో రైతుల కోసం అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. రైతాంగ సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం.. ఆయన దార్శనికతతో సహకార సంఘాలు నానాటికీ బలోపేతం అవుతున్నాయి.. పాలకవర్గాలు సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలి..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పండితాపురంలో రూ.31.58 లక్షలతో నిర్మించిన కొండాయిగూడెం సొసైటీ కార్యాలయం, గోదామును ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
కామేపల్లి, ఆగస్టు 14: రైతాంగ సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండలంలోని పండితాపురంలో రూ.31.58 లక్షలతో నిర్మించిన కొండాయిగూడెం సొసైటీ కార్యాలయం, గోదామును ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. డీసీసీబీ చైర్మన్గా కూరాకుల నాగభూషణం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీసీసీబీ లాభాల బాటలో నడుస్తున్నదన్నారు. సహకార సంఘాలను కంటికిరెప్పలా కాపాడుతున్నారన్నారు. సహకార సంఘాల బలోపేతానికి పాలకవర్గాలు కృషి చేయాలన్నారు.
రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కొండాయిగూడెం సొసైటీని జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. అనంతరం కార్యాలయం, గోదాము నిర్మాణాలను ఏడాదిలోపు పూర్తి చేయించిన సొసైటీ అధ్యక్షుడు హనుమంతరావును సన్మానించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. సహకార సంఘాలు రైతులకు దేవాలయాలన్నారు. ప్రభుత్వం సమకూరుస్తున్న ఎరువులు, విత్తనాలను సకాలంలో అందజేస్తున్నాయన్నారు. అనంతరం సొసైటీ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ భూక్యా లక్ష్మణ్నాయక్, జిల్లా సహకారశాఖ అధికారి విజయకుమారి, ఎంపీపీ బానోత్ సునీత, జడ్పీటీసీ బానోత్ వెంకట ప్రవీణ్కుమార్, ఎంపీటీసీ బోడెపూడి అనురాధ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, ఉప సర్పంచ్ కొమ్మినేని శ్రీనివాసరావు, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ బానోత్ నర్సింహనాయక్, సొసైటీ వైస్ చైర్మన్ గుగులోత్ సక్రూనాయక్, డైరెక్టర్లు అంబడిపూడి వెంకటేశ్వర్లు, దండగల దేవేందర్, వుప్పుగండ్ల వీరభద్రరావు, దొడ్డ మల్లేశ్, మేకపోతుల మహేశ్, సర్పంచ్లు మూడ్ దుర్గాజ్యోతి, భీమానాయక్ పాల్గొన్నారు.