సత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 10: నిరుపేద యువతులకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి మండలంలోని 17 గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ కింద మొత్తం రూ.44 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేశారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న యువతులకు తన సొంత ఖర్చులతో తెచ్చిన నూతన వస్ర్తాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదల ఇళ్లకు చేరడమే సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు.
చెక్కుల పంపిణీ సందర్భంలో ఆ నిరుపేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయానికి వారంతా ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారని అన్నారు. రామానగరం, గంగారం, పాకలగూడెం, బేతుపల్లి, తుంబూరు, నారాయణపురం, తాళ్లమడ, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, తోగ్గూడెం, బుగ్గపాడు, కొత్తూరు, రేజర్ల, కిష్టాపురం, యాతాలకుంట తదితర గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను నేరుగా కలిసి వారికి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఎమ్మెల్యేకు అడుగుడుగునా నాయకులు, లబ్ధిదారులు పూలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి (చిట్టినాయన), నాయకులు మట్టా ప్రసాద్, మోరంపూడి ప్రభాకర్, ప్రసాద్, గాదె సత్యం, గోగులమూడి బాలాజీరెడ్డి, తుంబూరు కృష్ణారెడ్డి, కంచర్ల నాగేశ్వరరావు, ఏగోటి పెద్దిరాజు, చల్లారి వెంకటేశ్వరరావు, తుమ్మూరు కృష్ణమూర్తి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఎర్రబాబు, సర్పంచ్లు పాలకుర్తి రాజు, కొడిమెల అప్పారావు, మామిళ్లపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
డైనోసార్ల కలిసి తిరిగిన ఉడుమును కనుగొన్న శాస్త్రవేత్తలు