ఎలిగేడు ఆగస్టు 19: ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు చొరవతో తన స్వగ్రామం లోకపేటలో రా ములోరి ఆలయం సకల హంగులతో రూపుదిద్దుకున్నది. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభోత్స వం చేసుకున్నది. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండగా, మొదటి రోజు భానుప్రసాదరావు-మంజుల దంపతులు పాల్గొన్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాల ప్రవేశంచేసి యాగాలు నిర్వహించారు. అం కురారోపణం, వాస్తు మంటపారాధన, బ్రహ్మ కలశస్థాపన, రుత్విక్వరుణం చేశారు.
20న ద్వార తోరణ పూజ, స్థాపితా దేవతా పూజలు, జలాధి-క్షీరాధివాసం, అధివాస హోమం, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలుంటాయి. 21న ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్ఠ, బలిహరణం, మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, శాంతి కల్యా ణం తదితర పూజలతో కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ, తన కు జన్మనిచ్చిన గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని రూ.35 లక్షల తన సొంత డబ్బులతో శ్రీ సీతారామచంద్రాలయాన్ని నిర్మించినట్లు చెప్పారు.
గ్రామ ప్రజలు కలిసి మెలిసి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవరనేని ప్రభావతి, ఉప సర్పంచ్ సుంచుల మల్లేశం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి అభిజిత్, తానిపర్తి రమణారావు, మాజీ సర్పంచ్ వొద్ది ప్రసాదరావు, దేవరనేని వేణుమాధవరావు, ధూళికట్ట మాజీసర్పంచ్ పడాల పరశురాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.