ముకరంపుర, ఆగస్టు 18: ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కరీంనగర్ సర్కిల్లో సాధారణ బదిలీల ప్రక్రియ గురువారం రాత్రి ముగిసింది. జిల్లాలో 26మంది ఏఈ, ఏఏఈలు, ఏడుగురు ఏఈడీలను బదిలీ చేస్తూ ఎస్ఈ గంగాధర్ పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ నెల 30లోగా రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హుజూరాబాద్ ఏడీఈ సత్యనారాయణను గుండి ఏడీఈగా, సీహెచ్ రాజేందర్ హెచ్టీ-ఎం(కరీంనగర్)నుంచి జమ్మికుంటకు, వీ కిరణ్కుమార్ను అలుగునూరు నుంచి ఎస్పీఎం(కరీంనగర్)కు, ఎన్ అంజయ్య ఎస్పీఎం నుంచి కన్స్ట్రక్షన్(కరీంనగర్)కు, పీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ నుంచి హుజూరాబాద్కు, కే శ్రీనివాస్రెడ్డి జమ్మికుంట నుంచి హెచ్టీ మీటర్స్(కరీంనగర్)కు, జీ శ్రీనివాస్ను గుండి నుంచి అలుగునూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జీ శ్రీనివాస్రెడ్డి(సిరిసిల్ల), కే నవ్య ( టెక్ ఎమ్మార్టీ-కరీంనగర్), డీ శ్రీనివాస్(టౌన్8-కరీంగనర్), కే గోఫఋనాథ్(ప్రొటెక్షన్1-కరీంనగర్), ఎం శ్రీనివాస్(హుజూరాబాద్ టౌన్), ఎం వీరాచారి(పెద్దపాపయ్యపల్లి), ఆర్ సంపత్రెడ్డి(తాడికల్), ఎం రమేశ్(చెంజర్ల), సీహెచ్ సంపత్కుమార్(కన్స్ట్రక్షన్-కరీంనగర్), బీ రవీందర్(కన్స్ట్రక్షన్-హుజూరాబాద్), పీ రవీందర్రెడ్డి(హెచ్టీ మీటర్స్1-కరీంనగర్), ఈఎల్పీ రాజు(కమర్షియల్-కరీంనగర్), డీ సంపత్కుమార్(టౌన్3-కరీంనగర్), జీ శ్రీనివాస్(తీగలగుట్టపల్లె), ఏ శంకరయ్య(గుండి), పీ శ్రీనివాస్(టౌన్1-కరీంనగర్), జీ వెంకటరమణయ్య(అలుగునూరు), ఏ తిరుపతి(గంగాధర), కే శ్రీనివాస్రావు(టౌన్5-కరీంనగర్), పీ జనార్దన్(ఎస్పీఎం కరీంనగర్), వీ శ్రీనివాస్(సైదాపూర్), ఎన్ నరేశ్(ముగ్ధుంపూర్), బీ రమేశ్(జమ్మికుంట రూరల్), కే ఆనంద్(టెక్నికల్-కరీంనగర్ టౌన్ డివిజన్), కే మల్లయ్య(కమర్షియల్-కరీంనగర్ రూరల్ డివిజన్), సీ తిరుపతి(బొమ్మకల్)కు బదిలీ అయ్యారు.
మెటర్నిటీ లీవ్లో ఉన్న జీ మౌనికకు కరీంనగర్ రూరల్ డివిజన్ కార్యాలయంలో రీపోస్టింగ్ ఇచ్చారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన పీ మమతకు(టెక్,హుజూరాబాద్డివిజన్)లో, మేడిపల్లి వెస్ట్ నుంచి వచ్చిన సుంక త్రిమూర్తికి(వీణవంక), కాటారం నుంచి వచ్చిన బీ ఆంజనేయులుకు(కమర్షియల్,హుజూరాబాద్ డివిజన్), బషీరాబాద్ నుంచి వచ్చిన డీ రవీందర్(హుజూరాబాద్ రూరల్), మెట్పల్లి టౌన్-2 నుంచి వచ్చిన ఎస్ చంద్రశేఖర్కు(ఎల్టీ మీటర్స్, కరీంనగర్), మహబూబబాద్ నుంచి వచ్చిన కే ఆంజనేయులుకు(గన్నేరువరం), బిక్నూర్ సౌత్ నుంచి వచ్చిన ఎన్ భూమయ్యకు(చొప్పదండి)పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. సివిల్ విభాగంలో మంచిర్యాల నుంచి వచ్చిన ఇద్దరు ఏఈలు పద్మసాయిగీతేశ్, ఎం సాయితేజకు(సివిల్-కరీంనగర్)లో పోస్టింగ్ ఇచ్చారు. కాగా కరీంనగర్ నుంచి ఆర్ వెంకటేశ్వర్రావు(సివిల్)ను జగిత్యాలకు బదిలీ చేస్తూ సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు.