స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 17: పాఠశాలలు దేవాలయాలని, విద్యాబుద్ధులు నేర్పే గురువులు దేవుళ్లని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని తన స్వగృహంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురికి ఆయన శాలువా కప్పి శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.17 కోట్లతో 170 అదనపు తరగతి గదులను నిర్మించనున్నట్లు తెలిపారు. వంద అంగన్వాడీ కేంద్రాలకు రూ.9కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు. అంతకు ముందు ఎంఈవో నాగేశ్వర్రావు, ఉపాధ్యాయులు స్పీకర్ను సన్మానించారు. కార్యక్రమంలో బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కుశాల్, నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్కుమార్, రవీందర్ జెట్టి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు సంతోష్కుమార్, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు రాంచందర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.