ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి/ రామారెడ్డి/ నాగిరెడ్డిపేట్/ పిట్లం/ బీబీపేట్, సెప్టెంబర్ 15 : జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. సీడీపీవో పారిజాత మాట్లాడుతూ.. ఇంటి పెరడులో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి, హెల్త్సూపర్వైజర్లు స్వరూపారాణి, బుజ్జి, హెల్త్ సూపర్వైజర్ మండోదరి, మండలస్థాయిలోని 71 సెంటర్లకు చెందిన అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
గాంధారి మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ అంగన్వాడీ కేంద్రంతోపాటు నేరల్తండా అంగన్వాడీకేంద్రంలో పౌష్టికాహారంపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనిత, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం గొల్లపల్లిలో అంగన్వాడీ టీచర్ జ్యోతి, సూపర్వైజర్ జాకేరా బేగం ఆధ్వర్యంలో గర్భిణులకు సాముహిక సీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో 35 ఏండ్లుగా ఆయాగా విధులు నిర్వహిస్తున్న ఖాసీంబీ రాజీనామా చేయగా.. సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ నర్సయ్య పాలకవర్గసభ్యులు ఆమె సేవలను కొనియాడి సన్మానించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో ఉన్న అంగన్వాడీకేంద్రంలో బాలింతలకు అంగన్వాడీ టీచర్ తులసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వంజరి సునీత, ఏఎన్ఎం లత పాల్గొన్నారు.
పిట్లం మండలం హస్నాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవంలో సర్పంచ్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, అంగనవాడీ టీచర్ రాధిక, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలంలోని రాంరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, టీచర్ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.