అక్రమ తరలింపును అడ్డుకున్న పలువురు రైతులు
ఒకరిపై కత్తితో దాడి చేసిన వ్యాపారులు
జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న రైతు
మిడ్జిల్ మండలం వాడ్యాల్లో ఘటన
మిడ్జిల్, ఏప్రిల్ 16 : ఇసుక మాఫియా బరితెగించింది. దుందుభీ వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలించడమే కాకుండా అడ్డుకోబోయిన యువ రైతుపై ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు కత్తితో దాడి చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల్ గ్రామ శివారు లో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నా యి.. మిడ్జిల్ మండలంలో 20 రోజుల నుంచి ఇ సుక అక్రమ రవాణ జోరుగా కొనసాగుతున్నది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆ రోపణలు ఉన్నాయి. దీంతో ఇసుక మాఫియా ఆ గడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడంతో ర వాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమం లో వాడ్యాల్ గ్రామ శివారులో ఉన్న దుందుభీ వాగు నుంచి కూడా ఇసుకను గుట్టుచప్పుడు కా కుండా తరలిస్తున్నారు. ఇసుక తరలింపుతో భూ గర్భ జలాలు అడుగంటుతాయని పరిసర ప్రాం తాల రైతులు రవాణాను అడ్డుకుంటూనే ఉన్నా రు. శుక్రవారం తెల్లవారుజామున ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను వాగు సమీపంలో వ్యవసాయ పొలం ఉన్న రైతు మధుతోపాటు మరో ముగ్గురు రైతులు అడ్డుకున్నారు. తమ బోర్లు వాగులో ఉ న్నాయని, ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గుతాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ సుక రవాణా విషయంలో పలుమార్లు మధు త మకు అడ్డుతగులుతున్నాడని ట్రాక్టర్ల డ్రైవర్లు, య జమానులు అతడితో ఘర్షణకు దిగారు. అతడిని కులం పేరుతో దూషించడంతోపాటు వారి వద్ద ఉన్న కత్తితో దాడి చేశారు. అక్కడే ఉన్న మిగితా రైతులు అడ్డుకునేందుకు యత్నించగా.. వారు అ క్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసు కున్న ఇన్చార్జి ఎస్సై లెనిన్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మధును అంబులెన్స్లో మహ బూబ్నగర్ దవాఖానకు తరలించగా చికిత్స పొం దుతున్నాడు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఎస్పీ విచారణ..
రైతుపై ఇసుక మాఫియా దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వాడ్యాల్ గ్రామంలో బా ధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధు పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని దాడులు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఆ యన వెంట డీఎస్పీ, సీఐ, ఎస్సై ఉన్నారు.
అధికారులపై ఆగ్రహం..
దుందుభీ వాగు నుంచి ఇసుక అక్రమ రవా ణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాడ్యాల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు ఉండటంతో వ్యాపారం జోరుగా కొనసాగుతుందని ఆరోపించారు. అధికారుల ని ర్లక్ష్యం వల్లే రైతు మధుపై దాడి జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
నలుగురికి రిమాండ్..
ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకు న్న రైతుపై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై జయప్రసా ద్ తెలిపారు. రైతు మధుపై దాడి చేసిన బీర్ల బీ రయ్య, బీర్ల రామకృష్ణ, బీర్ల రమేశ్, సిద్ధాపూర్ శ్రీశైలంపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
రాహుల్గాంధీ ఒక టూరిస్ట్ లీడర్: అమిత్ షా