నారాయణపేట, ఏప్రిల్ 6 : 45 ఏం డ్లు పూర్తైన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నా రు. పట్టణంలోని జిల్లా దవాఖానలో కొ విడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో మంగళవా రం ఎమ్మెల్యే టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా విషయంలో ఎలాంటి అపోహలకు గురికారాదన్నారు. టీకాతోనే కరోనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ పొందగలుగుతామన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు ధ రించి భౌతికదూరం పాటించాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమం లో వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో 24 గంటల్లో 55వేల కరోనా కేసులు
కరోనా ఎఫెక్ట్ : బీచ్లు, గార్డెన్లు, పబ్లిక్ గ్రౌండ్స్ మూసివేత!