ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
అందరూ కర్ణాటకలోని పుట్పాక్ వాసులు
మరికల్, మార్చి 28 : ముందు వెళ్తున్న డీసీఎం సడన్గా బ్రేక్ వేయడంతో వెనుకాలే వస్తున్న కారు ఢీకొని అందులోని ఇద్దరు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. ఎస్సై నాజర్ కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్ తాలూకా పుట్పాక్ గ్రామానికి చెందిన సతీశ్, రవిశంకర్, త్రివేణి, బ్రహ్మయ్య, శ్రీకాంత్ ఆదివారం హైదరాబాద్ నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. ఈ క్రమంలో మరికల్ మండలం అప్పంపల్లి గ్రామ స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. వెనుకాలే వస్తున్న కారు, డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రవిశంకర్ (55) అక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన సతీశ్ (50)ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన త్రివేణి, శ్రీకాంత్, బ్రహ్మయ్యకు గాయాలు కాగా మహబూబ్నగర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. సతీశ్ మృతదేహానికి మహబూబ్నగర్ దవాఖానలో, రవిశంకర్ మృతదేహానికి నారాయణపేట దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ఒంటరిగా ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఏడాదిలో 30 రోజులే ఈ గ్రామం కనిపిస్తుంది.. ఎక్కడంటే?