కుడి కాల్వ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం
రూ.1985.423 కోట్లతో పనులకు శ్రీకారం
160 కి.మీ. కాల్వ ద్వారా నీటి తరలింపునకు చర్యలు
పూర్తి ఆయకట్టు కోసం అనుమతి లేకుండానే పనులు
సామగ్రిని సిద్ధం చేస్తున్న ఏపీ అధికారులు
ఆందోళన చెందుతున్న కర్షకులు
మహబూబ్నగర్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రాజోళిబండ డైవర్షన్ స్కీంపై ఏపీ ప్రభుత్వం కుట్రకు తెరలేపింది. ఆనకట్ట వద్ద కుడి కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.1985.423 కోట్లతో పనులకు రంగం సిద్ధం చేసింది. అనుమతి లేకుండానే 160 కి.మీ. దూరం కెనాల్ నిర్మించి 4 టీఎంసీల నీటిని తరలించి 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందు పనులను ప్రారంభించింది. దీంతోపాటు నాలుగు లిఫ్ట్లు ఏర్పాటు చేసి మరో 5 లక్షల ఎకరాలకు అధికారిక అనుమతులు లేకున్నా నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. టెండర్లు ముగియగా.. పనులు ప్రారంభించేందుకు సామగ్రిని సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. అక్కడి సర్కారు తీరు ఆర్డీఎస్ ఆయకట్టుకే ఎసరు పెట్టేలా ఉన్నది. 87,850 ఎకరాలు, నదీ పరీవాహకంలోని 4 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే అవకాశం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహబూబ్నగర్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్డీఎస్పై ఏపీ ప్రభుత్వం ముందు నుంచే కన్నేసింది. ఇప్పుడు పూర్తి ఆయకట్టుపై కుట్రకు తెర లే పింది. గతంలో స్లూయిస్ ద్వారా ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ నుంచి తుంగభద్ర నీటిని తరలించుకుపోయిన నేప థ్యం మరవకముందే.. ఇప్పుడు ఏకంగా ఆర్డీఎస్ ఆ యకట్టుకే ఎసరు పెట్టింది. ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ వద్ద కుడి కాలువ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. దీ నిపై తెలంగాణ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా కుడికాలువ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన్ స్కీం) కుడి వైపున ఏపీ సర్కారు రూ.1985.423 కోట్లతో నూతనంగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 4 టీఎంసీల నీటిని 160 కి.మీ గ్రావిటీ కాలువ ద్వారా తరలించి 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కుట్రకు తెరలేపారు. టెండర్లు ముగిసి పనులు ప్రారంభించేందుకు మంగళవారం సామగ్రి సై తం తరలించారు. రూ.1985.423 కోట్లతో ఈ పను లు చేస్తున్నారు. కాలువతో పాటు 4 లిఫ్టులు ఏర్పాటు చేసి అదనంగా మరో 5 లక్ష ఎకరాలకు అక్రమంగా నీ టిని తరించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ కాలువ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వానికి ఎ లాంటి అధికారిక అనుమతులు లేవు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 4 టీఎంసీల కృష్ణా జలాలను తుంగభద్రకు తరలించి వాడుకునేందుకు మాత్రమే అ వకాశం ఉంది. సీడబ్ల్యూసీ, అపెక్స్ కమిటీ, కృష్ణ వా టర్ మేనేజ్మెంట్ బోర్డుతోపాటు కర్ణాటక, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేదు. కృష్ణా బే సిన్ నుంచి తమకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 4 టీఎంసీల కేటాయింపులున్నాయని పేర్కొం టూ కాలువ నిర్మాణం చేపట్టబోతున్నది. ఈ కాల్వ ని ర్మాణంతో తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గంలోని 100 గ్రామాలకు తాగునీటి కటకట ఏర్పడుతుం ది. ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదీ పరీవాహక ఆయకట్టు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే అ వకాశం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నూతన ఆయకట్టు కోసం..
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు ని యోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు కాలువ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. పనులు చేపట్టేందుకు ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ వద్దకు కుడి వైపున స్టీల్, యంత్రాలు, సిబ్బందిని తరలించారు. ముహూర్తం చూసుకుని పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ కాలువ నిర్మిస్తే ఆర్డీఎస్ ఆయకట్టు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారనున్నది. తుంగభద్ర పై ఆధారపడి ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు తుమ్మిళ్ల, గా ర్లపాడ్, మద్దూర్, బుడమొర్సు ఎత్తిపోతల పథకాలకు సాగునీటి కష్టా లు ఏర్పడనున్నా యి.