తొర్రూరు, ఏప్రిల్ 4 : మండలంలోని వెంకటాపురంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వరస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం వందలాది మంది మహిళలు బోనాలతో బొడ్రాయి నుంచి ఆలయానికి తరలివెళ్లి నైవేద్యం సమర్పించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు. ఉత్సవాల్లో సర్పంచ్ శీలం లింగన్నగౌడ్, గౌడ కుల సంఘం అధ్యక్షుడు నిమ్మల సాయిలు, శీలం వెంకన్న, గాదగాని సోమనర్సయ్య, ముత్యం వెంకన్న, కొండ శ్రీను, నిమ్మల వెంకన్న, నలమాస శోభన్, మొగుళ్ల వెంకటేశ్వర్లు, బొలగాని శ్రీనివాస్, శీలం సుమంత్, పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
మార్స్పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు