కనుల పండువగా లక్ష్మీనర్సింహస్వామి జాతర
కోలాహలంగా ‘కోటంచ’
పెద్ద రథంపై స్వామి వారి ఊరేగింపు
భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలు
గీసుగొండ, మార్చి 28 : కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలిచ్చే లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వరంగల్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర ప్రతి సంవత్సరం హోలీ రోజు జరుగుతుంది. మార్చి 20న స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, ఆదివారం రాత్రి 10 గంటలకు లక్ష్మీనర్సింహస్వామికి పూర్ణాహుతి, ఉద్వాసన కార్యక్రమాలను అర్చకుడు కాండూరి రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారి బండ్లు గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశాయి. భక్తుల నామస్మరణతో జాతర ప్రాంగణమంతా మార్మోగింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి మార్వాడీల ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించారు. మొదట ఆముదం చెట్టుకు ఆవు పిడకలు పెట్టి పూజలు చేశారు. అనంతరం చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ రంగులు పూసుకున్నారు.
ఇవి కూడా చదవండి
నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే..?