ఎంపీవో సురేశ్
చెన్నారావుపేట, ఏప్రిల్ 10: ఈజీఎస్ పనుల్లో కూలీల హాజరు తగ్గుతున్నదని, హాజరు శాతం పెరిగేలా మేట్లు కృషి చేయాలని ఎంపీవో సురేశ్ అన్నారు. కోనాపురంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీవో శనివారం పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల్లో జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన గ్రామంలోని వైకుంఠధామం పనులు, నర్సరీ, శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు వాడిపోకుండా రెండు పూటలా నీళ్లు పట్టాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్లను కూడా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కార్యదర్శులు, సర్పంచ్లకు సూచించారు. ఎంపీవో వెంట సర్పంచ్ వెల్దె సుజాత-సారంగం, కార్యదర్శి రాజు ఉన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
రాయపర్తి: మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను విధిగా కరోనా నిబంధనలు పాటిస్తూ చేయాలని ఈజీఎస్ ఏపీవో దొణికెల కుమార్గౌడ్ సూచించారు. మండలకేంద్రంలోని రెండుమర్లు ప్రాంతంలో చేపట్టిన ఫీడర్ కెనాల్ పూడికతీత పనులను ఆయన సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి తనిఖీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల కూలీలు ఉదయం 7 నుంచి 11 గంటలకు ఉపాధి పనులు చేపట్టాలని ఏపీవో కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, కారోబార్ కారుపోతుల రాంచంద్రయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.
ముమ్మరంగా ఉపాధి పనులు
నర్సంపేట రూరల్: మండలంలోని గురిజాల, జీజీఆర్పల్లి, చిన్నగురిజాల, ఇటుకాలపల్లి, ముత్తోజిపేటలో ఉపాధి పనులు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, కార్యదర్శుల సూచనలు, సలహాల మేరకు కూలీలు పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసీ అరుణ్, టీఏలు భద్రు, వెంకటేశ్వర్లు, ఉపేందర్ మేట్లు, కూలీలకు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి
పట్వారిగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్తకోణం