కమలాపూర్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు కోరారు. శుక్రవారం మండలంలోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కరోనా టీకా తీసుకున్నారు. వైద్యులు సంయుక్త, హర్షిణీప్రియ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హసన్పర్తి పీహెచ్సీలో వ్యాక్సినేషన్..
హసన్పర్తి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 45 సంవత్సరాలు పైబడిన 115 మంది టీకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సునీల్దత్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరూ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని, కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూపర్వైజర్ సుమతి, ల్యాబ్ టెక్నీషియన్లు ఉమాదేవి, సునీత, ప్రశాంతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
టీకా తీసుకోవాలి..
వేలేరు : కరోనా టీకాను 45సంవత్సరాలు పైబడిన వారందరూ తీసుకోవాలని వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జ్ఞానేశ్వర్ కోరారు. పలు గ్రామాల నుంచి ప్రజలు వ్యాక్సిన్ కోసం మండల కేంద్రంలోని పీహెచ్సీకి రావడానికి ఉచితంగా ఆర్బీఎస్కే వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వంగర, ములుకనూరు దవాఖానల్లో..
భీమదేవరపల్లి : వంగర, ములుకనూరు దవాఖానల్లో 45 సంవత్సరాలు పైబడిన వారు టీకాలు వేసుకున్నారు. వంగర, ములుకనూరు ప్రభుత్వ వైద్యాధికారులు స్వరూపారాణి, మోహన్, వైద్యసిబ్బంది వేణు, రాజేశ్వర్రెడ్డి, కేఎల్ఎన్ స్వామి, రాజ్కుమార్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్ 2021: ఏ జట్టు ఎన్నిసార్లు టైటిల్ కొట్టింది
41 సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష