ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మూడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గన్నేరువరం, ఏప్రిల్ 25: ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. మండలంలోని చీమలకుంటపల్లి, మైలారం, సాంబయ్యపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నదని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, సర్పంచులు కర్ర రేఖాకొమురయ్య, దుడ్డు రేణుకామల్లేశం, చింతలపెల్లి నర్సింహారెడ్డి, ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, నాయకులు గూడూరి సురేశ్, బూర వెంకటేశ్వర్లు, ప్యాక్స్ డైరెక్టర్ బోయిని అంజయ్య, నాగపురి శంకర్, బామండ్ల తిరుపతి, రాజశేఖర్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.