ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
గన్నేరువరం మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
గన్నేరువరం, ఏప్రిల్ 22: రైతుల సౌకర్యార్థమే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని గుండ్లపల్లి, గునుకులకొండాపూర్, జంగపెల్లి, గోపాలపూర్, హన్మాజీపల్లి, గన్నేరువరం, ఖాసింపేట గ్రామాల్లో గురువారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం గన్నేరువరంలో వారసంత, శ్మశానవాటిక నిర్మాణాలను పరిశీలించారు. ఖాసింపేటలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పినప్పటికీ, సీఎం కేసీఆర్ రైతులు ఇబ్బందులు పడకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 45 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ తిరుపతి, మండల కో-ఆర్డినేటర్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో స్వాతి, ఏవో కిరణ్మయి, ఏపీఎం జ్యోతి, వైద్యాధికారి శ్రీనివాస్, సర్పంచులు సమత, లక్ష్మి, జ్యోతి, శారద, రజిత, మల్లీశ్వరి, నగేశ్, ఎంపీటీసీలు రాజేశంగౌడ్, ఆంజనేయులు, కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకన్న, నాయకులు లక్ష్మణ్, సుధాకర్, వెంకటేశ్వర్లు, రాజేందర్రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్, మహేందర్రెడ్డి, సురేశ్, సంపత్రెడ్డి, రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
లైవ్ పర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నా..రవీనా త్రోబ్యాక్ వీడియో
వరిపేటలో పిడుగుపాటుకు రైతు మృతి