చిగురుమామిడి, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని హు స్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. రేకొండలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అం బేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే నేడు అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు. విగ్రహ నిర్మాణానికి సహక రించిన కమిటీ సభ్యులు, దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ రవీందర్, సర్పంచ్ పిట్టల రజిత, ఎంపీటీసీలు కొత్తూరు సంధ్య, చాడ శోభ, ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్, ఎస్ఐ చల్ల మధూకర్రెడ్డి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో పాటు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో గాయకుడు పల్లె నర్సింహులు ఆటా పాటలు ఆహుతులను అలరించాయి.
ఇవి కూడా చదవండి
రాణా, రాహుల్ మెరుపులు..కోల్కతా 187/6