తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సృజనాత్మక కలిగిన విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వర్తమాన స్వాతంత్య్ర భారత ముఖచిత్రం అనే అంశం ఆధారంగా కళాఖండాలను చిత్రించి ఫోటో తీసి 9848747432 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు-వారి నుండి పొందిన స్పూర్తి అశంపై వ్యాసాలను 30 లైన్లకు మించకుండా రాసి 9490316725 నెంబర్కు వాట్సాప్లో పంపించాలన్నారు.
భారత శాస్త్రవేత్తలు వారు సాధించిన విజయాలు అనే అంశంపై క్విజ్ పోటీలకు 9505054544కు పంపించాలని సూచించారు. ఈ నెల 14లోపు విద్యార్థులు తమ అంశాలకు సంబంధించిన వివరాలను పంపించాలని కోరారు. ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు.