కందుకూరు : మండల పరిధిలోని లేమూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేశారు. 2002-2003వ సంవత్సరంలో 10తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో సరస్వతి దేవి విగ్రహన్ని పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహన్ని ఆదివారం సర్పంచ్ జంగిలి పరంజ్యోతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండల్రెడ్డి, ప్రదానోపాధ్యాయులు ఆరుంధతి, ఉపాధ్యాయులు రఘునాద్, మురళీ, వెంకటేష్, సురేష్,మురళీ శ్రీనివాస్, జైపాల్రెడ్డి, సుకుమార్, వెంకటేష్,పూర్వ విద్యార్థులు శ్రీకాంత్రెడ్డి. రాకేష్రెడ్డి, వెంకటేష్, బాస్కర్,త్రినాథ్, నయిమ్ ఉన్నీసా బేగం, మల్లేష్,విజయ్, కుమార్.గణేష్లు పాల్గొన్నారు.