కవాడిగూడ: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సీనేషన్ను వేయించుకోని ఆరోగ్యంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజక వర్గంలోని గాంధీనగర్ డివిజన్ పీపుల్స్ పార్కు, రాంనగర్లోని పోచమ్మ టెంపుల్ లైబ్రరీ, అడిక్మెట్ డివిజన్లోని వడ్డెర బస్తీ దవాఖాన, ముషీరాబాద్ డివిజన్లోని శివాలయం వద్ద, భోలక్పూర్ డివిజన్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో కోడిడ్ వ్యాక్సీనేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సీనేషన్ వేసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేష్, నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత, డీపీఓ రత్నరాణి, డాక్టర్ పద్మజా, డాక్టర్ కృష్ణమోహన్ రావు, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మీ, టీఆర్ఎస్ భోలక్పూర్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్ రావు, ఎ. శంకర్ గౌడ్, గాంధీనగర్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, రాంనగర్ అధ్యక్షుడు శ్యామ్సుందర్, శ్రీ భవాణీ శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్ శ్రీనివాస్, గోవింద్ రాజ్, నాయిని ఆనంద్, ప్రభాకర్, పోతుల శ్రీకాంత్, సరేందర్, కేఎం సాయి, తదితరులు పాల్గొన్నారు.