సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో…
ముషీరాబాద్ : గోల్కొండ చౌరస్తా శ్రీనివాస కాలనీలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే.రత్నాకర్ ప్రారంభించారు. అంతకుముందు భగవాన్ శ్రీ సత్యసాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల మూలంగా విద్యార్థులకు కంటి సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య సేవలందిస్తున్న డాక్టర్ సంధ్యని సత్కరించారు. హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వెంకట్రావు, ఎ.మల్లేశ్వర్రావు, కె.గజపతి రాజు, జీ.లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ ఎంఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో…
లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ కంటి వెలుగు ఆధ్వర్యంలో రాంనగర్లోని శ్రీనివాస కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్నినిర్వహించారు. ఈశిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ రవిచారి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణుడు టీ.శ్రీనివాస్, లయన్స్ క్లబ్ చైర్పర్సన్ తాళ్ళపల్లి చైతన్య, పుశ్పగిరి ఆసుపత్రి ప్రతినిధులు వెంకటేశ్, నవీన్రెడ్డిలు పాల్గొన్నారు.