ముషీరాబాద్: రచయిత,నటుడు నల్లూరి వెంకటేశ్వర్రావు రచించిన నలభై ఏళ్ల ప్రజానాట్యమండలి పుస్తకావిష్కరణ సభ సోమవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గోరేటివెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, వందెమాతరం శ్రీనివాస్, తమ్మారెడ్డి భరద్వాజలతో కలిసి 40 యేళ్ల ప్రజా నాట్యమండలి పుస్తకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రజానాట్యమండలి నాయకులు కందిమల్ల ప్రతాప్రెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్రావులను ఘనంగా సత్కరించారు.