కొండాపూర్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ 2.0 -5కే రన్లో వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పరుగులు తీశారు. రన్ను వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బస్తుకర్ జగదీశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా వర్సిటీలో రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్కరు రోజు వ్యాయామాలతో పాటు నడకను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ నాగార్జున, ఉన్నత్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రావుల క్రిష్ణయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వీ రాజశేఖర్, సైకాలజికల్ కౌన్సిలర్ సుభాష్లతో పాటు భోధన, భోదనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.