కొండాపూర్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో స్వతంత్ర సమరయోధుల చిత్రాల ప్రదర్శనను నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుల చిత్రాల ప్రదర్శనను ఆదివారం స్వాతంత్య్ర సమర యోధులు బట్ట రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో పలువురు చిత్రకారులు గీసిన స్వతంత్ర సమరయోధుల పోర్టెట్ చిత్రాలను శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్రావుతో కలిసి తిలకించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రాలను చూస్తుంటే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నేటి స్వాతంత్ర్య భారతాన్ని సుసాధ్యం చేసేందుకు ఎంతోమంతి మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. భవిష్యత్తులో దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. అనంతరం అపర్ణ ధూళిపాళ బృందం ‘జయ కేతనం’ పేరిట దేశ భక్తి గీతాల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.