అమీర్పేట్: శ్రావణమాసం తొలి రోజున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. రంగురంగుల పూలు, పండ్లతో అమ్మవారి మండపాన్ని అందంగా అలంకరించారు.