అడ్డగుట్ట : పారిశుద్ద్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదని జలమండలి డీఓపీ స్వామి అన్నారు. గురువారం అడ్డగుట్టలో జరిగిన జలమండలి పక్షోత్సవాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్,నగర గ్రంధాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జలమండలి జీఎం రమణరెడ్డి, డీజీఎం కృష్ణ, సెక్షన్ మేనేజర్ స్రవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడ్డగుట్టలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ద్య నిర్వాహణ, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డీఓపీ స్వామి మాట్లాడుతూ…మ్యాన్హోళ్ళల్లో మనం నిత్యం వాడే షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, బట్టలు, దిండ్లు, పరుపులు, పాలిథీన్ కవర్లు, సీసాలు, గాజు ముక్కలు వేయవద్దని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పారిశుద్ద్య నిర్వాహణపై అవగాహనను పెంచుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ… ప్రజలకు ఎప్పటికప్పుడు పారిశుద్ద్యంపై అవగాహనను కల్పించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మ్యాన్హోళ్లలో వ్యర్థాలను విచ్చలవిడిగా వేయడం ద్వారానే డైనేజీ సమస్య తలెత్తుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస నాయకులు నక్కమధు, మనోహర్, పొన్నాల రాజు, వడ్లూరి రవితో పాటు తదితరులు పాల్గొన్నారు.