అమీర్పేట్:పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయి సురక్షిత పద్ధతులను అనుసరిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం సనత్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి సురక్ష కిట్లను ఆమె ఖైతరాబాద్ సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ భార్గవ్ నారాయణతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వైరల్, విషజ్వరాలు ప్రబలుతున్న ఈ తరుణంలో పారిశుద్ధ్య పనులను చేపడుతున్న సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కిట్లో ఉన్న మాస్కులు, శానిటైజర్లు, పాదరక్షలు, గ్లౌజులు, రెయిన్ కోట్, రేడియం కోట్ తదితర వస్తువలను సిబ్బంది వినియోగించుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, పారిశుద్ధ్య విభాగం సూపర్వౌజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.